Saturday, 30 May 2015

మహర్షులు శాపాలు  ఇవ్వడం వలనే హిందువులకి ఇంత వాంగ్మయము అంటే రామాయణము, భాగవతం, మహా భారతం  లాంటి ఇతి హాసాలు వచినవి ద కదా . మనిషి ఎలా ఉండాలో , ఎలా ప్రవర్తించాలో రామాయణము ద్వారా మనకు చెబుతారు కాబట్టి నా అబిప్రయములో అవి కేవలము శాపాలు కాదు , శాపా అనుగ్రహము .
మనలాంటి మాములు మనుషులు కోపానికి లొంగుతారు , అందుకనే ఎవరితో గొడవ పడితే ఇంక మనం వాడి మొఖమ్ కూడా చుడం , కానీ అరిశాద్వార్గాలకు లోను కానీ ఋషులు కోపం వచ్చి శాపం పెట్టిన , వెంటనే  శాప విమోచనం కూడా చెబుతారు . కోపానికి లోను కారు , కోపం వచినట్టు నటిస్తారు . అలా నటించారు కాబట్టే భాగవతం , మహా భారతము, రామాయణం లాంటి ఇతిహాసము (ఇది ఇలాగే జరిగింది ) వచ్చినవి.

భాగవతం , మహా భారతము, రామాయణం మన నిత్య జేవితంలో ఉపయోగపదట్లేదంటారా ????
మతము అంటే పెద్దలు ఏమి చేబుతారంటే మనిషి మతి నుండి పుట్టినది అని ,  ఫలానా వ్యక్తి , ఫలానా సంవత్సరంలో పుడితే ఫలానా మతము పుట్టినది చెపుకోవటానికి మనది మతము కాదు మరి ఏమిటి ???? హిందూ మతం అంటారు కొంత మంది  కాదు , ధర్మము  సనాతన ధర్మము  . ఏ  మనిషి మతి నుండి పుట్టలేదు.


అందుకే సనాతన ధర్మం లోవర్ణాశ్రమ వ్యవస్థ (నాలుగు వర్ణములు ), ఆశ్రమ ధర్మాలు  గురించి నొక్కి చెప్పారు , అర్ధం చేసుకుంటే మన జీవితానికి సోపానాలు అవుతాయి , వర్ణాశ్రమ వ్యవస్థ అర్ధం కాకపోతే  కుల పిచ్చి అని , ఇంకొకటి అని ఎదో ఒకటి విమర్శిస్తుంటారు .

భారత దేశాన్ని ఇంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల పాటు అన్య మతస్తులు పరిపాలించారు, మత మార్పిడులు చేశారు,  ఎన్నో అవమానాలకి, అవహేలనలకి , తిరస్కరాలకి , ఆటు పొట్ల కి గురి అవతు  ఉన్న నిలబడుతుంది , గెలుస్తుంది సనాతన ధర్మము , సనాతన ధర్మమే లేని యెడల  ప్రపంచమే ఉండదు అని నా వ్యక్తిగత అబిప్రాయము .

జై శ్రీ రామ్ అంటే  ఏమిటి ?????????

జై  (జిందాబాద్ )
శ్రీ  (శ్రీ మాత్రే నమః )
రా (నమో నారాయణాయ)
మ (నమః శివాయ )

భగవంతుడు ఒక్కడే 



No comments:

Post a Comment